కొల్లి కృష్ణమోహన్ మనకు దూరమై ఇప్పటికి 24 సంవత్సరాలు గడిచాయి. ఈ సందర్భం పురస్కరించుకుని మన ఊరి వాళ్ళు నిన్న సాయంత్రం 7 గంటలకు కొల్లి కృష్ణమోహన్ స్మారక స్థూపం దగ్గర నివాళి అర్పించారు. ఈ కార్యక్రమం లో కుటుంబ రావు గారు, యేసు బాబు, భుట్టోజి, చిన్ని, బండి రామ క్రిష్ణ, కావురి సాయి, రావి సతీష్, రావి ప్రశాంత్, వేములపల్లి పిచ్హేశ్వర రావు, సూరయ్య, సాంబయ్య గారు, సత్యం గారు, సురేష్, హేమంత్ పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.
హైదరాబాద్ లో వుంటున్న రావి వారి పాలెం - మోపిదేవి గ్రామస్థుల వన భోజనాలు నవంబర్ 18న ప్రగతినగర్ జరిగాయి. దాదాపు 400మంది ఈ ఆత్మీయ కలయిక కు వచ్చారు.